కేసులు సత్వరమే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

కేసులు సత్వరమే పరిష్కరించాలి

May 27 2025 12:25 AM | Updated on May 27 2025 12:25 AM

కేసులు సత్వరమే పరిష్కరించాలి

కేసులు సత్వరమే పరిష్కరించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాలోని పలు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణలో జాప్యం లేకుండా సత్వరమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్‌రాజ్‌ అన్నారు. తన కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్‌లో వివిధ సమస్యలపై బాధితులు అందించిన దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలపై సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలను తీసుకోవడం ద్వారా వారికి న్యాయం చేయాలని ఆదేశించారు.

విధుల్లో నిర్లక్ష్యం తగదు

టేకులపల్లి : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఎస్పీ రోహిత్‌రాజు సిబ్బందిని హెచ్చరించారు. సోమవారం ఆయన టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేషన్‌ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చేలా మెలగాలని సూచించారు. నమోదైన కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టేకులపల్లి సీఐ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌లో ఎస్పీ రోహిత్‌రాజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement