
డీర్పార్కును అభివృద్ధి చేయాలి
● వెలుగుమట్ల తరహాలో తీర్చిదిద్దాలి
● ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్
పాల్వంచరూరల్ : కిన్నెరసాని డీర్పార్క్ను అభివృద్ధి చేయాలని, ఖమ్మంలోని వెలుగుమట్ల పార్కు తరహాలో తీర్చిదిద్దాలని ఇన్చార్జ్ డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్ సూచించారు. పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని సోమవారం అయన సందర్శించారు. వైల్డ్లైఫ్ చెక్పోస్టు పనితీరు, డీర్పార్కులోని దుప్పులను, అద్దాలమేడ, కాటేజీలను పరిశీలించారు. పనుల వివరాలపై సిబ్బందితో ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. కిన్నెరసాని నుంచి అడవి దున్నలు అధికంగా సంచరించే రేగళ్ల ఫారెస్ట్ వరకు సఫారీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని, నిధులు మంజూరైతే పర్యాటకులను అకట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. చిల్డ్రన్స్ పార్కును కూడా అభివృద్ధి చేయాలని చెప్పారు. ఆయన వెంట రేంజర్ కవిత మాధురి, బీట్ అధికారి ఉమాదేవి, వైల్డ్లైఫ్ సిబ్బంది ఉన్నారు.