ఆ చరిత్రాత్మక జలయజ్ఞ ఫలం ఇప్పుడు మదనపల్లె ప్రజలకు వరంగా మారింది. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి విడుదల చేస్తున్న కృష్ణా జలాలను, పక్కనే సాగుతున్న పుంగనూరు ఉపకాలువ నుంచి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులోకి విడుదల చేశారు. ఇప్పుడు కృష్ణమ్మ మదనపల్లె ప్రజల దాహం తీర్చేందుకు ట్యాంకును నింపుతోంది. ఈ అద్భుత ఫలితానికి, సుదీర్ఘ తాగునీటి ప్రగతికి అసలైన కారకుడైన మహానేత వైఎస్సార్ను, ప్రతి ఏటా నీరందించి ఆదుకున్న జగనన్నను ఈ సందర్భంగా పట్టణ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.


