రెండేళ్లుగా ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్ష రాశా. పేపర్ లీక్ వ్యవహారంతో రద్దు చేయడం విస్మయాన్ని కల్గించింది. ఇంటర్లో 92 శాతం మార్కులు వచ్చాయి. ఎంబీబీఎస్పై ఆసక్తితో విజయవాడ శ్రీ చైతన్య కళాశాలలో రెండేళ్ల పాటు నీట్పై ప్రత్యేక శిక్షణ తీసుకున్నా. నాతో పాటు తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు గురయ్యారు. ఎగ్జామ్ కూడా బాగా రాశా. మళ్లీ ప్రిపేర్ కావడం ఆపై రీ ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆందోళన కల్గిస్తోంది. ఎన్టీఏ వైపల్యం కారణంగా లక్షలాది మంది నీట్ విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది.
–టి.దీపాన్విత, ఆది కుమార్తె, కురబలకోట


