నీట్ ప్రవేశ పరీక్ష బాగా రాశామనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇది నిరాశజనక వార్తే. పరీక్ష రద్దుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే లక్షల మంది మానసికక్షోభకు గురిచేసిన వారికి ఇంక మళ్ళీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయాలంటే భయం కలిగేలాగా శిక్ష ఉండాలి. అలాగే మళ్లీ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి.
– డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి, సైకాలజిస్ట్


