ఉరేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు..
పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన నారాయణ కొడుకు ఆర్.రమేష్ (22) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్య చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


