మదనపల్లె: ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రానున్న వీబీ జీ రాం జీ పథకం పక్కాగా అమలవుతుందని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం అన్నారు. మంగళవారం జిల్లాలోని ఏపీవోలు, సాంకేతిక అధికారులకు పథకం అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త పథకం గురించి శిక్షణ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులతో ఈ పథకం అమలవుతుందన్నారు. ఉపాధి పనులకు వచ్చే కూలీలకు కచ్చితంగా ఐరిస్ ద్వారానే హాజరుంటుందని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఏపీవోల వరకు పథకం అమలుపై అవగాహన పెంచుకొని పనిచేయాలన్నారు.
ఉపాధి పనుల పరిశీలన
వాల్మీకిపురం: వికసిత్ భారత్ జి రాం జి పథకం కింద 125 రోజులు ఉపాధి పనులు కల్పించనున్నట్లు డ్వామా పీడీ తెలిపారు. మంగళవారం చింతలవారిపల్లి, విఠలంలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.


