
నేటి నుంచి రిజిస్టర్ పోస్టు రద్దు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దశాబ్దాలుగా పోస్టల్ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్ట్ రద్దవుతోంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడు పోస్టులో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇకనుంచి స్పీడ్ పోస్ట్ పార్సిల్ సేవలు అందనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్లో ట్రాకింగ్ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది. పార్సెల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ పార్సిల్ ఎక్కడుంది. ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్లో చూసుకునే వెసులుబాటు కల్పించింది.
సరికొత్త టెక్నాలజీ
దిశగా....
పోస్టల్ శాఖలో ఇప్పటివరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి సరికొత్త సాంకేతిక ఆధునికతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలందిస్తోంది. జులై నెలకు ముందు పోస్టల్ శాఖ మొత్తం సేవలు కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అందేవి. వీటినే అడ్వాన్స్్డ్ టెక్నాలజీతో ఉన్న ఏపీటీ 2.0 అమలులోకి తెచ్చింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్ పోస్ట్ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు కడప పోస్టల్ డివిజన్లో అన్ని ఏర్పాట్లు చేశారు.