
అంతిమ విజయం న్యాయానిదే
రాజకీయంగా పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని ఎదుర్కోలేక కుట్రపూరితంగా కూటమి సర్కార్ అక్రమ మద్యం కేసు పెట్టింది. మిథున్కు బె యిల్ మంజూరు కావడం మంచి పరిణామం. వైఎస్సార్సీపీ శ్రేణులపై పెడుతున్న అక్రమ కే సులు ఎన్నో రోజులు నిలవవు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తగిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు బుద్ధిచెబుతారు. ఎవరెన్ని తప్పుడు కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే.
– గడికోట శ్రీకాంత్రెడ్డి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గత ఎన్నికల సమయంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కోలేక కూటమి సర్కార్ మద్యం అక్రమ కేసు పెట్టింది. ఈ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు కావడం చాలా సంతోషంగా ఉంది. ఏసీబీ కోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. ఇలాంటి తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికై నా కూటమి పాలకులు బుద్ధి తెచ్చుకుని ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం పాటుపడాలి.
– ఆర్ రమేష్కుమార్ రెడ్డి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి

అంతిమ విజయం న్యాయానిదే