సాక్షి, తాడేపల్లి: ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన రోత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ(బుధవారం, ఏప్రిల్ 8) కూడా ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట వైఎస్సార్సీపీ శాంతియుత నిరసనలు చేపట్టనుంది. మహిళలను ఉద్దేశించి పైశాచిక కామెంట్స్ చేసిన రాధాకృష్ణ తీరును ఎండగట్టాలని ప్రయత్నిస్తోంది.
శాంతియుత ర్యాలీకి పోలీసుల అడ్డంకులు
- రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విశాఖలో వైఎస్సార్సీపీ శాంతియుత నిరసన
- నిరసనలో పాల్గొన్న గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, ఉమ్మడిగి శాఖ జిల్లా నాయకులు
- వైఎస్సార్సీపీ నిరసనపై పోలీసుల జులుం
- నిరసన కోసం వేసిన టెంటును తీసివేసిన పోలీసులు
- శాంతియుత ర్యాలీకి అడుగడుగునా అడ్డంకులు
- ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి వచ్చే నాయకులను అడ్డుకుంటున్న పోలీసులు
- ఏజెన్సీ ప్రాంత ప్రజా ప్రతినిధులను, అనకాపల్లి జిల్లా నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
- పోలీసులు తీరుపై మండిపడుతున్న వైఎస్సార్సీపీ నేతలు
- ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ నేతల డిమాండ్
భారీగా మోహరించిన పోలీసులు
అన్నమయ్య జిల్లాలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆందోళన
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి సుంకర చక్రధర్ ఆధ్వర్యంలో నిరసన
అంబేద్కర్ విగ్రహ వద్దకు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం
భారీగా మోహరించిన పోలీసులు
- ఆంజాద్ బాషా హౌజ్ అరెస్ట్
- వైఎస్సార్సీపీ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు
- వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నాయకుల హౌస్ అరెస్టులు
- మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఇంటి వద్ద మోహరించిన పోలీసులు
- అంజాద్ బాషా ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
- మాజీ మేయర్ పాక సురేష్ కుమార్ కూడా హౌస్ అరెస్ట్
- నేడు కడపలోని ABN కార్యాలయం ఎదుట నిరసనకు సిద్ధమైన వైఎస్సార్సీపీ శ్రేణులు
- ఈ నిరసనలకు హాజరు కావద్దంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం
విజయవాడ ఏబీఎన్ ఆఫీస్ వద్ద..
- ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ ఏబీఎన్ కార్యాలయం వద్ద ఆందోళనకి సిద్దమైన వైఎస్సార్సీపీ
- ఏబీఎన్ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు..
- ఏబీఎన్ కార్యాలయానికి వెళ్లే రహదారులలో బారికేడ్స్ ఏర్పాటు చేసిన పోలీసులు
- నిరసన తెలిపి తీరతామంటున్న వైఎస్సార్సీపీ నేతలు
మహిళలకు ఏబీఎన్ రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది. రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయని మచ్చ, విలువలు దిగజార్చేలా ఉన్నాయని చెప్పారు. మహిళలను ఆయన అవమానించారని తెలిపారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, బ్రోకరిజమని మండిపడ్డారు. మహిళలకు రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్లోని ఏబీఎన్ ఆఫీసు ఎదుట వైసీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నేతలు ధర్నా చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా నేడు ఏపీలోనూ శాంతియుత నిరసనలు తెలపనున్నారు.


