రేపు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌ | YSRCP Ambati Sensational Comments On Jagan Tours: Andhra pradesh | Sakshi
Sakshi News home page

రేపు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌

Jun 17 2025 4:43 AM | Updated on Jun 17 2025 10:37 AM

YSRCP Ambati Sensational Comments On Jagan Tours: Andhra pradesh

కూటమి ప్రభుత్వ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఉపసర్పంచ్‌ నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ  

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటనపైన పోలీసుల ఆంక్షలు  

ఆయన కాలు పెడితే టీడీపీకి వణుకు పుడుతోంది  

అలజడి సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్‌ కుట్రలు   

గుంటూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు

సాక్షి,అమరావతి: కూటమి ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఈనెల 18న మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  పరామర్శించనున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెంటపాళ్లలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్‌ జగన్‌ ఆవిష్కరిస్తారని తెలిపారు.

వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతిభద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్‌ జగన్‌ పర్యటనపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వైఎస్‌ జగన్‌  చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీరి్ణంచుకోలేకపోతోంది.

అసలు వైఎస్‌ జగన్‌ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేశ్‌కి వణుకు పుడుతోంది. నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళితే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను అడ్డుపెట్టుకుని రాళ్ల దాడికి దిగారు. మా కార్యకర్తలు, అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలు పాలు చేశారు’ అని చెప్పారు.   

	జగన్ గుంటూరు పర్యటనపై నారా లోకేష్ కుట్ర..

పర్యటనను అడ్డుకోవాలని చూస్తే ఊరుకోం  
‘ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్‌ జగన్‌ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే కూటమి దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్‌ జగన్‌ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు.

ఇది అప్రజాస్వామికం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు, లోకేశ్‌ కుట్రలు పన్నుతున్నారు. పర్యటనలను అడ్డుకోవాలని చూస్తే సహించబోం. ప్రతిపక్ష నేత పర్యటనలను అడ్డుకోవడం, అలజడి సృష్టించేందుకు యతి్నంచడం కూటమి ప్రభుత్వానికే మంచిది కాదు.’’ అని అంబటి హితవు పలికారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement