వినాయక చవితి పూజల్లో వైఎస్‌ జగన్‌ | YS Jagan Participates in Vinayaka Chavithi Celebrations at YSRCP Office | Sakshi
Sakshi News home page

తాడేపల్లి: వినాయక చవితి పూజల్లో వైఎస్‌ జగన్‌

Aug 27 2025 10:52 AM | Updated on Aug 27 2025 12:06 PM

YS Jagan Participate Ganesh Festival Celebrations At YSRCP Central Office

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్రకార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి గణనాథుడి తొలి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విఘ్నేషుడికి హారతి ఇచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు.

వైఎస్‌ జగన్‌ షెడ్యూల్‌ ప్రకారం.. బుధవారం ఉదయం విజయవాడ రాణిగారితోట వద్ద జరిగే వినాయక పూజలో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షాల కారణంగా ఆ పర్యటన రద్దు అయ్యింది. దీంతో తాడేపల్లి ఆఫీసులోనే జరిగే పూజలోనే ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్ సహా పార్టీ నేతలు హాజరయ్యారు.

 

 

Tadepalli: గణపతి పూజలో వైఎస్ జగన్

Advertisement
 
Advertisement
Advertisement