వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నుంచి వైఎస్సార్‌సీపీకి సర్టిఫికెట్

Wonder Book Of Records Certificate To YSRCP Over Blood Donation - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా నిర్వహించిన రక్తదానం రికార్డులకెక్కింది. ఈ మేరకు వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి సర్టిఫికెట్‌ అందింది. మంగళవారం ఈ సర్టిఫికెట్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌  కార్పొరేషన్‌ చైర్మన్‌ మధుసూధన్‌రెడ్డి, ఆప్కో చైర్మన్‌ చిల్లపల్లితో కలిసి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ప్రదర్శించారు. చదవండి: (రక్తం పంచిన అభిమానం)

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 'సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా చేసిన రక్తదానం రికార్డులకెక్కింది. మేము రికార్డుల కోసం పనిచేయలేదు. కోవిడ్‌ సమయంలో రక్తం కొరత దృష్టిలో ఉంచుకొని ఓ మంచి పనిని చేపట్టాం. పార్టీ కార్యకర్తలుగా మాకు గర్వంగా ఉంది. ఈ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రాలకు మేము రక్తం అందిస్తున్నాం. భవిష్యత్తులో ప్రజల కోసం మరిన్ని సేవా కార్యాక్రమాలు చేస్తాం' అని లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top