మేమంటే అంత చులకనా బాబూ? | Women Police Association angry over Chandrababu comments | Sakshi
Sakshi News home page

మేమంటే అంత చులకనా బాబూ?

Jan 10 2024 5:06 AM | Updated on Jan 10 2024 5:06 AM

Women Police Association angry over Chandrababu comments - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసులను ఉద్దేశించి ప్రతిపక్ష నేత చంద్ర­బాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతు­న్నాయి. 40 ఏళ్ల సీనియర్‌ రాజకీయ నాయకుడినని చెప్పు­కునే ఆయన తమను ఉద్దేశించి అంత చులక­నగా మాట్లాడటం, నిరాధార ఆరోపణలు చేయడంపట్ల మహిళా పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు­న్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంపిక పరీక్ష ద్వారా ఉద్యోగాలు పొందిన తమను నామినే­టెడ్‌ ఉద్యోగులని చంద్రబాబు హేళన చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

విజయ­వా­డ­లో మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలి­శాక చంద్ర­బాబు మీడియాతో మాట్లాడుతూ గ్రామ, వార్డు సచి­వా­లయ ఉద్యోగులు.. అందు­లోనూ మహిళా పోలీ­సులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాల­న్నా­రు. అంతేకాకుండా వీరిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు (బీఎల్‌వో)లుగా వీరు పనిచేస్తున్నారని.. వీరిని తొలగించాలన్నారు. నామినేటెడ్‌ ఉద్యోగాలు పొందిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధుల్లో ఎలా నియమిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.

వారికి ఏం అవగాహన ఉంది.. ఎన్నికల విధులు, ఓటర్ల నమోదు గురించి ఏం తెలుసన్నారు. అంతటితో చంద్రబాబు సరిపెట్ట­లేదు. మహిళా పోలీసుల వ్యకి­్తత్వం గురించి కూడా అవమానకరమైన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వ­హించిన రాత పరీక్ష ద్వారా మెరిట్‌ ప్రాతి­పదికన ఉద్యోగాలు పొందిన తమను ఆయన అవ­మానించారని సచివాలయ ఉద్యోగులు మండిపడుతు­న్నారు.

తాము విధుల్లో చేరాక రెండేళ్ల­పాటు ప్రొబేషన్‌లో ఉన్నా­మని.. ఈ కాలంలో ప్రతి­భ చూపినందుకు ప్రభు­త్వం తమను రెగ్యులరైజ్‌ చేసిందని గుర్తుచేస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లా­గానే, ప్రభుత్వ నిబంధనల మేరకే తాము కూడా నియమితులయ్యామనే విషయాన్ని చంద్రబాబు తెలుసుకోవాలని వారంటున్నారు. అటువంటి తమను నామినేటెడ్‌ ఉద్యోగులని హేళన చేయడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు.

ఎన్నికల విధులకు మేమెందుకు అర్హులం కాదు?
ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అంతా ఎన్నికల విధులు నిర్వహించేందుకు అర్హులు అయిన­ప్పు­డు తామెందుకు కామని మహిళా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ తమను ద్వితీయశ్రేణి ఉద్యోగులుగా వివక్షాపూరితంగా చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రద్దు చేస్తా­మని గతంలోనే చంద్రబాబు, ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చె­న్నాయుడు పలు­మార్లు చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి టీడీపీ వ్యవహార శైలి అదే తీరులో ఉండటం గమనార్హం.

తాజాగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై చంద్రబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆయన ఉద్దేశాన్ని పునరుద్ఘాటించాయి. టీడీపీ అధికారంలోకి వస్తే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తొలగించడంతోపాటు తమను తీవ్ర అవస్థల పాలు చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను కించపరిచిన చంద్రబా­బు­కు రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరి­స్తున్నారు.

తమ వ్యక్తిత్వాన్ని కించపరి­చేలా చంద్రబాబు నిరాధారణ ఆరోపణలు చేయ­డంపై మహిళా పోలీసులు మండిపడుతున్నారు. మహి­ళలు అంటే చంద్రబాబుకు ఎంతటి చిన్న­చూపో.. ఎంతటి చులకన భావముందో మరోసారి ఈ వ్యాఖ్యల ద్వారా నిరూపించారని రాష్ట్ర మహిళా పోలీసుల సంఘం మండిపడింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల ప్రధానంగా మహిళా పోలీసుల పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement