Rains in AP: Northeast Monsoon is Starting for Two Days | కోస్తాంధ్రలో రెండు రోజులు వానలు - Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రెండు రోజులు వానలు

Oct 28 2020 4:28 AM | Updated on Oct 28 2020 1:14 PM

Two days of rains in AP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా బుధవారం నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి. మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. ఉత్తర తమిళనాడు తీరానికి సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో 3.1 నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement