సామాన్య భక్తులను పట్టించుకోరా? | Tirumala Devotees Fires On Minister Anam Ramanarayana | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులను పట్టించుకోరా?

Sep 17 2024 5:06 AM | Updated on Sep 17 2024 5:06 AM

Tirumala Devotees Fires On Minister Anam Ramanarayana

క్యూ లైన్‌లో ఆదివారం నుంచి వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదు 

అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయలేదు 

దేవదాయ శాఖ మంత్రి ఆనంపై భక్తులు ఫైర్‌

తిరుమల: తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదని.. ఆదివారం నుంచి క్యూలైన్‌లో వేచి ఉన్నా శ్రీవారి దర్శన భాగ్యం కలగలేదంటూ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిపై తమిళనాడుకు చెందిన బుల్లితెర నటుడు మహేశ్‌తో పాటు పలువురు భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమ­వారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకు­న్న అనంతరం ఆనం మీడి­యాతో మాట్లాడుతుండగా.. ఆయన్ని ఆలయ అధికారి అని భావించిన తమిళనాడు భక్తులు చుట్టుముట్టేశారు. వీరిలో తమిళ నటుడు మహేశ్‌బాబు కూడా ఉన్నారు.

ఆయన మాట్లాడుతూ.. 10 మంది కుటుంబసభ్యు­లతో కలిసి ఆదివారం తిరుమలకు చేరుకు­న్నట్లు చెప్పారు. ఆదివారం క్యూ లైన్‌లోకి వెళ్లినా స్వామివారి దర్శన భాగ్యం మాత్రం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూ లైన్లలో అన్నప్రసాదాలు కూడా పంపిణీ చేయట్లేదని మరికొందరు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నప్రసాదం, పాలు, మజ్జిగ ఇవ్వకపోవడంతో.. చిన్న పిల్లల­తో క్యూ లైన్లలో ఉండలేక బయటకు వచ్చేశా­మంటూ వాపోయారు. తిరుమలలో ఏర్పాట్లు అస్సలు బాగోలేదంటూ మరో భక్తుడు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆనం స్పందిస్తూ.. అధికారుల ద్వారా శ్రీవారి దర్శనం కల్పిస్తానంటూ సర్దిచెప్పి.. అక్కడి నుంచి జారుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement