నారా లోకేశ్తో టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి (ఫైల్) , పరిటాల శ్రీరామ్తో హరి (ఫైల్)
లైంగిక దాడికి యత్నించిన టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి
అనంతపురంలోని వనమిత్ర పార్కులో ఘాతుకం
ఆలస్యంగా వెలుగులోకి ..
ధర్మవరం: అనంతపురం జిల్లా కేంద్రంలో మహిళలపై తెలుగు తమ్ముళ్ల అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసులమని చెప్పుకుని జనాన్ని బెదిరిస్తూ అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఈ క్రమంలోనే పార్కులో ఉన్న ఫార్మా విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి లైంగికదాడికి యత్నించాడు. ఈ దురాగతం ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. బాధిత విద్యార్థిని ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు టీడీపీ కార్యకర్త కటకటాలపాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 26న అనంతపురం రూరల్ పరిధిలోని టీవీ టవర్ వద్ద ఉన్న వనమిత్ర పార్కులో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫార్మసీ కళాశాలలో చదువుతున్న యువతి, ఆమె స్నేహితుడు మాట్లాడుకుంటున్నారు.
అదే సమయంలో ధర్మవరానికి చెందిన టీడీపీ కార్యకర్త కొక్కంటి హరి అక్కడికి వెళ్లాడు. ‘మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మేం పోలీసులం. విచారణ చేయాలి. స్టేషన్కు రండి’ అంటూ భయపెట్టే యత్నం చేశాడు. దీంతో ఆ విద్యార్థులు తామేం తప్పు చేశామని ప్రశ్నించారు. ఇంతలో టీడీపీ కార్యకర్త హరి యువతిని బలవంతంగా పార్కు ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి ఉడాయించాడు.
మరుసటి రోజు ఉదయం బాధితురాలు అనంతపురం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు హరిని అరెస్టు చేశారు. లైంగికదాడియత్నం కేసు నమోదు చేసి.. రిమాండ్కు తరలించారు. కాగా.. ధర్మవరం పట్టణంలోనూ టీడీపీ కార్యకర్త హరి అనేక ఆగడాలకు ఒడిగట్టాడు. మంత్రి నారా లోకేశ్, పరిటాల శ్రీరామ్, ఇతర నాయకులకు హరి సన్నిహితుడని సమాచారం. వారి అండతో అనేక దౌర్జన్యాలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


