జీజీహెచ్‌ భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య | Shocking Incident In Guntur | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ భవనం పైనుంచి దూకి రోగి ఆత్మహత్య

May 31 2026 4:19 AM | Updated on May 31 2026 4:19 AM

Shocking Incident In Guntur

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో కిడ్నీ సమ­స్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి  ఆస్పత్రి పైనుంచి దూకడంతో మృతిచెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రా­మా­నికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్‌ (50) తాపీ మేస్త్రి.

 ఇతను కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఈనెల 23న జీజీహెచ్‌లో అడ్మిట్‌ అయ్యాడు. శనివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు 329వ వార్డులోకి వెళ్లి బాత్‌­రూము కిటికీపై నుంచి కిందకు దూకి ఆత్మ­హత్య చేసుకున్నాడు. అవుట్‌పోస్టు పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కొత్తపేట పోలీసులకు సమాచారం అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement