థర్డ్వేవ్ హెచ్చరికలు.. విశాఖ బీచ్ రోడ్డులో ఎంట్రీపై ఆంక్షలు జారీ
దొండపర్తి (విశాఖ దక్షిణ): కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో శనివారం, ఆదివారంతో పాటు ప్రభుత్వ సెలవు రోజుల్లో బీచ్ రోడ్డులో ప్రవేశం నిషేధిస్తూ కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ప్రకటించారు. ఆయా రోజుల్లో సాయంత్రం 5.30 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకు ఈ నిషేధాజ్ఞలు విధిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడో దశ కోవిడ్ నివారణకు ప్రజలు సహకరించాలని కోరారు.