మంత్రి కొడుక్కి నీపై మనసైంది! | Ministers unofficial PA harasses single woman | Sakshi
Sakshi News home page

మంత్రి కొడుక్కి నీపై మనసైంది!

Nov 27 2025 4:51 AM | Updated on Nov 27 2025 4:51 AM

Ministers unofficial PA harasses single woman

నువ్వంటే చాలామంది  టీడీపీ నేతలు పడి ఛస్తున్నారు 

వారికి సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను 

ఒంటరి మహిళకు మంత్రి అనధికారిక పీఏ వేధింపులు

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘మంత్రిగారి కొడుక్కి నీపై మనసైంది. ఆయన వద్దకు వెళ్లు. నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడిఛస్తున్నారు. వాళ్లతో గడుపు. సహకరించకపోతే ఉద్యోగం చేయ­నీ­యను’ భర్త చనిపోయిన బాధలో ఉండి గుండెజబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవ­నం సాగిస్తు­న్న ఓ మహిళకు మంత్రి అనధికార పీఏ వేధింపులు ఇవి. బా­ధి­తురాలి కథనం ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఉపాధ్యా­యుడు 2021లో కరోనాతో మర­ణిం­చారు. 

ఆయన భార్య కారుణ్య నియామకం కోసం ప్రయత్నిస్తుండగా.. ఆ వీధిలోనే ఉండే సతీష్‌ జోక్యం చేసుకు­న్నా­డు. ఆ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి అనధి­కార పీఏగా వ్యవహరిస్తున్నాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. ఖర్చు­లు ఉంటా­యని రూ.5 లక్షలు గుంజాడు. లోబ­ర్చుకునేందుకు యత్నించాడు. 

చివరకు ఆ మహిళకు విద్యాశాఖలో ఆఫీస్‌ సబార్డినేట్‌ ఉద్యో­గం వచ్చింది. తన ఉద్యో­గం కోసం జిల్లా పరిషత్‌లో సతీష్‌ ఎవరికీ లంచాలు ఇవ్వలేదని తెలిసి బాధితురాలు నిలదీసింది. దీంతో పగ పెంచుకుని, ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల స్కూల్‌కు బదిలీ చేయించాడు. 

మంత్రికి విన్నవించినా.. 
ఆకస్మిక బదిలీతో హతాశురాలైన మహిళ తాను ఉద్యోగంలో చేరి ఏడాదిన్నరే అయిందని, గుండె జబ్బుతో బాధపడుతున్న బిడ్డ ఉందని, అత్యవసరమైతే మారుమూల గిరిజన గ్రామంలో వైద్యం దొరకదని జిల్లా మంత్రికి మొరపెట్టుకుంది. సతీష్‌ తన దగ్గర డబ్బు తీసుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. మంత్రి.. సతీష్ నే వెనుకేసుకొచ్చారు. బాధితురాలు విద్యాశాఖ మంత్రి పేషీని సంప్రదించింది. అక్రమ బదిలీపై హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.  

అయినా ఆగని వేధింపులు 
‘డబ్బులు తిరిగిచ్చేది లేదు. టీడీపీలో చాలామంది నాయకులు నువ్వంటే పడి ఛస్తున్నారు. వాళ్లతో గడ­పకపోతే సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను’ అంటూ సతీష్ ఆ మహిళకు మెసేజ్‌లు పంపాడు. బాధితు­రాలి ఇంటికి టీడీపీ నాయకులు, మున్సిపల్‌ కౌన్సిలర్లను పంపి బెదిరించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని మంత్రికి చెప్పుకుందామని బాధితురాలు వెళ్లగా.. అక్కడా ఆమెపైన, ఆమె బంధువులపైన సతీష్ కు చెందినవారు దాడి చేశారు. పోలీసులను సంప్రదిస్తే పట్టించుకోలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement