Minister RK Roja: ‘అది చంద్రబాబు ప్లాన్‌.. లోకేశ్‌ కాకుండా పవన్‌ ఇరుక్కున్నాడు’

Minister RK Roja Comments On TDP Chandrababu And Pawan Kalyan - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పపన్‌ కల్యాణ్‌పై మంత్రి ఆర్కే రోజా ఫైరయ్యారు. కర్నూలులో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించాలని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, మంత్రి రోజా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ సంక్షేమానికి తూట్లు పొడిచి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసిన వ్యక్తి చంద్రబాబు. మరోసారి చంద్రబాబుకి అవకాశం ఇస్తే నష్టపోతామని ప్రజలు గుర్తించారు. చంద్రబాబు తానొక మాజీ ముఖ్యమంత్రినని మర్చిపోయాడు. కర్నూలు జిల్లాలో వీధి రౌడీలా వ్యవహరించాడు. చంద్రబాబు భాష చూస్తే తలదించుకునేలా ఉంది. చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌ను వాడుకుని వదిలేస్తాడు. పవన్‌ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. రాష్ట్ర సమస్యలపై పవన్‌కు అవగాహన లేదు. చంద్రబాబు, పచ్చ ఛానెళ్ల డైరెక్షన్‌లో పవన్‌ నడుస్తున్నాడు.  

చంద్రబాబు.. పవన్‌కు వాడుకుని విశాఖ ఎయిర్‌పోర్టులో మంత్రులపై దాడులు చేయించాడు. ఇప్పటంలో అక్రమ నిర్మాణాల విషయంలో కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కోర్టు సమయాన్ని వృథా చేసిన 14 మందికి మనిషికి లక్ష చొప్పున న్యాయస్థానం జరిమానా విధించింది. ఇప్పటం విషయంలో పవన్‌కు ఇంతకంటే పెద్ద దెబ్బ మరొకటి ఉండదు. ఇప్పటంలో పోటీ చేసేది చంద్రబాబు కొడుకు లోకేశ్‌. అయితే, లోకేశ్‌ వెళ్లాల్సిన చోటుకు పవన్‌ ఎందుకు వెళ్లాడు. పవన్‌ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించాలి. పవన్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఫుల్ టైమ్ ప్రజల్లో ఉండాలి. షూటింగ్ గ్యాప్‌లో వచ్చి డ్రామాలు చేయాలనుకుంటే ప్రజలు నమ్మరు. పవన్ గురించి తెలుసుకాబట్టే రెండు చోట్లా ప్రజలు పవన్‌కు ఓడించారు’ అని వ్యాఖ్యలు చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top