చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే పట్టాభి వ్యాఖ్యలు: పేర్నినాని

Minister Perni Nani Fires On Chandrababu In Krishna - Sakshi

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్లాన్‌ ప్రకారమే పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఏపీ మంత్రి పేర్నినాని అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు వయసుకు తగ్గ ఆలోచనలు చేయడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో గొడవలు సృష్టించాలన్నాదే బాబు లక్ష్యమని అన్నారు. చంద్రబాబుకు అధికారం లేకపోతే నిద్రపట్టదని విమర్శించారు. అందుకే.. గతంలో అయ్యన్నపాత్రుడుతో దుర్భాషలాడించారు. అప్పుడు వారి ప్లాన్‌ ఫలించలేదని అన్నారు.

అందుకే మళ్లి ఇప్పుడు పట్టాభితో వివాదాస్పద వ్యాఖ్యలు చేయించారన్నారు. కేంద్రమంత్రి అమిత్‌ షాతో.. చం‍ద్రబాబు ఫోన్‌లో మాట్లాడితే వీడియోలు రిలీజ్‌ చేసి హడావిడి చేసేవారని అన్నారు. కేవలం అమిత్‌ షా అపాయింట్‌ మెంట్‌ కోసమే బాబు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో అమిత్‌షాపై టీడీపీ నేతలు రాళ్లేయించారని అన్నారు. చంద్రబాబు ప్రతిసారి దిగజారీ రాజకీయాలు చేస్తుంటారని అన్నారు. బాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక భాష.. లేకపోతే మరో భాష మాట్లాడతారని మంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చదవండి: అధికారం దక్కలేదని చిచ్చుపెడుతున్నారు: సీఎం జగన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top