పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్‌.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..! | Massive increase in mobile data usage | Sakshi
Sakshi News home page

పెరిగోపోతున్న డేటా ట్రాఫిక్‌.. ఒక్కొక్కరు నెలకు 19.5 జీబీ వాడేస్తున్నారు..!

Apr 8 2023 5:29 AM | Updated on Apr 8 2023 3:34 PM

Massive increase in mobile data usage - Sakshi

సాక్షి,  అమరావతి: దేశంలో డేటా ట్రాఫిక్‌ పెరుగుతోంది. మొబైల్‌ వినియోగంలో భారీ పెరుగుదల నమోదవుతోంది. గడచిన ఐదేళ్లలో ఏకంగా 3.2 రెట్లు వృద్ధి చెందింది. ప్రస్తుతం సగటున ఒక వ్యక్తి నెలకు 19.5 జీబీ డేటా ఖర్చు చేస్తుండగా.. 2027 నాటికి 46 జీబీకి చేరుకుంటుందని టెలికాం సంస్థలు అంచనా వేస్తున్నాయి.

అంటే... ఒక వ్యక్తి ద్వారా నెలలో 136 శాతం డేటా వాడకం పెరగనుంది. దేశంలో చౌకగా మొబైల్‌ డేటా లభిస్తుండటంతోపా టు హైస్పీడ్‌ 5జీ నెట్‌వర్క్‌ విస్తరణతో డేటా విస్తతిలో గణనీ య మైన మార్పులొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సంస్థలు వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్‌ డేటా నెట్‌వర్క్‌ల కోసం సుమారు 240 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేయనున్నాయి.  

240 గంటలకు పైగా బ్రౌజింగ్‌ 
ప్రపంచ జనాభాలో దాదాపు 65.60 శాతం మందికి ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంది. 4.60 బిలియన్ల మంది ఇంటర్నెట్‌ సౌకర్యాలను ఉపయోగిస్తున్నారు. దేశంలో అయితే 65 కోట్ల మంది స్మార్ట్‌ ఫోన్లు వాడుతున్నారు. తాజా గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజు 3.5 క్వింటిలియన్‌  బైట్ల డేటా అవసరం అవుతోంది. భారత్‌లో అయితే, ప్రస్తుతం సగటున నెలకు ఒక వ్యక్తి 240 గంటలకుపైగా ఇంటర్నెట్‌ను బ్రౌజ్‌ చేస్తున్నారు. ఈ లెక్కన దేశం మొత్తం ఒక నెలకు డేటా వినియోగం 
14 ఎక్సాబైట్‌లకు చేరుకుంది. ఇక్కడ ఒక ఎక్సాబైట్‌ ఒక బిలియన్‌ గిగాబైట్లకు సమానం.

చౌకైన డేటా! 
ప్రపంచ వ్యాప్తంగా చౌకైన మొబైల్‌ డేటా అందిస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్‌ ప్రథమ స్థానంలో ఉంది. అక్కడ ఒక జీబీ డేటా కేవలం 0.04 అమెరికన్‌ డాలర్లుగా ఉంది. యూకే డేటా గణాంకాల వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం.. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇజ్రాయెల్‌ పౌరులు స్మార్ట్‌ఫోను వినియోగిస్తుండటంతో ఇది అమెరికా కంటే ఎక్కువ స్మార్ట్‌ఫోన్ల వ్యాప్తిని కలిగి ఉంది. తక్కువ రేటుకు మొబైల్‌ డేటా అందిస్తున్న దేశాల్లో ఇటలీ (0.12 డాలర్లు) రెండవ, భారత్‌ (0.17 డాలర్లు) మూడవ స్థానంలో ఉన్నాయి. 

మరోవైపు అత్యంత ఖరీదైన డేటా ప్లాన్‌లు ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని మారుమూల ద్వీప దేశాల్లో ఉన్నాయి. ఫాక్లాండ్‌ దీవుల్లో ప్రజలు ఒక జీబీ డేటా కోసం 38.45 డాలర్లను ఖర్చు చేయాల్సి వస్తోంది. సెయింట్‌ హెలెనాలో అయితే 41.06 డాలర్లుగా ఉంది. ఇక్కడ ప్రజలు ఇజ్రాయెల్‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వెచి్చంచి మొబైల్‌ డేటాను కొనుగోలు చేస్తున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement