తప్పిన తుపాన్‌ ముప్పు | Low pressure area continues in the Bay of Bengal | Sakshi
Sakshi News home page

తప్పిన తుపాన్‌ ముప్పు

Nov 27 2025 5:04 AM | Updated on Nov 27 2025 5:04 AM

Low pressure area continues in the Bay of Bengal

ఇండోనేషియాలో తీరం దాటిన ‘సెనియార్‌’

మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం  

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సెనియార్‌ తుపాన్‌ ముప్పు తప్పింది. అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం.. క్రమంగా ఇండోనేషియా వైపు కదులుతూ బుధవారం తుపాన్‌గా మారి తీరం దాటింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు మినహా ఎటువంటి ప్రభావం ఉండదని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం అక్కడే కొనసాగుతోంది. 

అలాగే ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టా­నికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది వచ్చే 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ఆ తర్వాత 48 గంటల్లో తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement