నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే కక్ష సాధింపు | Kommineni Srinivasa Rao on Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

నేనంటే చంద్రబాబుకు పగ.. అందుకే కక్ష సాధింపు

Jun 10 2025 3:38 AM | Updated on Jun 10 2025 3:38 AM

Kommineni Srinivasa Rao on Chandrababu Naidu

సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు

సాక్షి, హైదరాబాద్‌: తన అరెస్టుపై సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. ‘నేను సీనియర్‌ సిటిజన్‌ని ఎలా అరెస్టు చేస్తారు? సెర్చ్‌ వారెంట్‌ కూడా ఇవ్వలేదు. 70 ఏళ్ల వయసులో నాపైన ప్రభుత్వా­నికి ఇంత కక్ష దేనికి? కక్ష గట్టి చేస్తున్నారు. నా వల్ల ఎవరికి నష్టం కలిగిందో, ఇబ్బంది కలిగిందో చెప్పడం లేదు. పోలీసులు రూల్స్‌ పాటించకుండా ఐడీ కార్డులు చూపి తుళ్లూరు తీసుకువెళ్తామని చెప్పారు. ఇంటిలో పైకి వెళ్లి మందులు తెచ్చుకోవడానికి కూడా పోలీసులు ఒప్పులేదు. 

ఫిర్యాదు ఎవరు ఇచ్చారో చెప్పకుండా కావాలనే నాపై కక్ష గట్టి చేస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ పరిస్థితే ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితేంటి? కేసు ఎవరు పెట్టారో చెప్పడం లేదు. సాక్షిలో నా డిబేట్‌లు రాకుండా చేయాలని చూస్తున్నా­రేమో. ప్రభుత్వ వ్యతిరేక వాయిస్‌ వినిపించకుండా చేసే ప్రయత్నం జరుగుతోంది. జర్నలిస్టులను కూడా వదిలిపెట్టడం లేదు. రెడ్‌ బుక్‌లో ఇది కూడా భాగమేమో. 

గతంలో ఒక టీవీ చానెల్‌లో నేను పనిచేస్తున్నప్పుడు అమరావతి భూములపై నేను డిబేట్‌ చేస్తే యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి నన్ను తొలగించేలా చేశారు. అప్పటి నుంచి నాపై చంద్రబాబుకు కోపం ఉంది. ఆ తర్వాత నాకు వైఎస్‌ జగన్‌ సాక్షిలో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏ అవకాశం లేకపోయినా కావాలని నాపై పోలీసులు దొంగ కేసు పెట్టారు. నేను అనని విషయంపైన కేసు పెట్టడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. అమరావతి మహిళలను ఎవరూ ఏమీ అనలేదు. కావాలని రెచ్చగొట్టి చేస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్‌కు కోపం వస్తే ఎవరైనా జైలుపాలు కావాల్సిందే’ అని ఆవేదన వ్యక్తం చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement