సాక్షి,విశాఖ: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. గతంలో మూడు సార్లు ఇలానే సీఐఐ సదస్సులు నిర్వహించారు. 2014-19 మధ్యలో లక్షకోట్లు పెట్టుబడులు వస్తాయని నమ్మించారు. మొత్తం మీద 35వేలకోట్లు మాత్రమే రూపాంతరం చెందాయి. వచ్చాయి. లక్షల ఉద్యోగాలు వస్తాయని యువతకి లేని పోని ఆశలు పెట్టి నమ్మించి మోసం చేశారు.
మా ప్రభుత్వంలో సదస్సు నిర్వహించాం. కానీ పారదర్శంగా ఎంవోయూలు కుద్చుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ సీఐఐ సదస్సులో కొత్తగా ఏం తీసుకొచ్చారో క్లారిటీ ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు.


