21న రంజాన్‌ సెలవు | Govt issued orders rescheduling Ramadan holiday to 21st of this month | Sakshi
Sakshi News home page

21న రంజాన్‌ సెలవు

Mar 20 2026 2:49 AM | Updated on Mar 20 2026 2:49 AM

Govt issued orders rescheduling Ramadan holiday to 21st of this month

పదోతరగతి ఇంగ్లిష్‌ పరీక్ష వాయిదా

ఏప్రిల్‌ 2న పరీక్ష నిర్వహణ

నేడు యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు

సాక్షి, అమరావతి: రంజాన్‌ సెలవును ఈనెల 21వ తేదీకి మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత మార్చి 20న ప్రభుత్వం రంజాన్‌ సెలవుగా ప్రకటించింది. మతపెద్దల నిర్ణయం మేరకు 21వ తేదీ శనివారం రంజాన్‌ పర్వదినాన్ని  నిర్వహిస్తున్నందున, ఆ రోజు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. కాగా శనివారం జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్‌ పరీక్ష వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షను ఏప్రిల్‌ 2న నిర్వహించనున్నట్లు వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement