ప్రగతిని వివరిస్తూ.. సమస్యలు తీరుస్తూ | Sakshi
Sakshi News home page

ప్రగతిని వివరిస్తూ.. సమస్యలు తీరుస్తూ

Published Wed, May 25 2022 5:23 AM

Gadapa Gadapaki Mana Prabhutvam getting good response all over - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం మూడేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ.. ప్రజలు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, అమలు చేస్తున్న పథకాలను వివరిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 14వ రోజు మంగళవారం ఈ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. నేతలకు ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు. ఈ ప్రభుత్వంలో తమకు కలిగిన లబ్ధిని వివరిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన సమస్యల్ని వెంటనే పరిష్కరించేందుకు అక్కడే ప్రజాప్రతినిధులు అధికారులతో మాట్లాడుతున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు వెంటనే తీరుతున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement