అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం | Fake news Enadu on the filling of teaching posts in universities | Sakshi
Sakshi News home page

అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం

Aug 11 2023 4:49 AM | Updated on Aug 14 2023 10:53 AM

Fake news Enadu on the filling of teaching posts in universities - Sakshi

సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూత­కల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విష­పూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతు­న్నా­రు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాప­కుల ఉద్యోగాలకు జగన్‌ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 

3,295 పోస్టుల భర్తీ 
ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియా­మ­కాలు చేప­డుతోంది. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీ­రావు ఒ­ప్పం­ద ఉద్యోగులకు భద్ర­త కరు­వైందంటూ ఊహా­జనిత వార్త­ను అ­చ్చే­శారు. వాస్త­వానికి రాష్ట్రంలో 20 వర్సి­టీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యా­పకులు పని చేస్తు­న్నారు. వీరి­లో అత్యధిక శాతం సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వ­ర్సి­టీ­ల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియా­మకా­లన్నీ రెగ్యులర్‌ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకు­లకు ఎటువంటి ఇబ్బందీ లేదు.

వెయిటేజీతో భరోసా
వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకు­లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెయి­టేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వర­లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ­తంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమ­బద్ధీ­కరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియ­మించేటప్పుడు రిజిర్వేషన్‌ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్‌ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు.

కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్‌ పోస్టు­లకు పని చేస్తున్నారో కూడా తెలి­యదు. ఆ వ్యత్యా­సా­న్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రతిబంధకా­లుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యా­యం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తా­విస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. 

Advertisement
 
Advertisement
Advertisement