జనసేన సేత రాసలీలల కేసు.. పోలీసుల నిర్లక్ష్యం | Bhimavaram Police Negligence Exposed Over Janasena Leader Episode | Sakshi
Sakshi News home page

జనసేన సేత రాసలీలల కేసు..పోలీసుల నిర్లక్ష్యం

Apr 9 2026 10:01 PM | Updated on Apr 9 2026 10:02 PM

Bhimavaram Police Negligence Exposed Over Janasena Leader Episode

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన సేత రాసలీలల కేసులో పోలీసుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడింది.  జనసేన నేత జయప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అదే సమయంలో బాధితురాలిగా అండగా నిలవాల్సిన పోలీసులు.. కూటమి ప్రభుత్వ నాయకులకు కొమ్ముకాస్తున్న వైనం కొట్టొచ్చినట్లు కనబడింది. 

రాజకీయ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు.  భీమవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో సీఐ, ఎస్సైలు ఉన్నా జయప్రకాశ్‌పై కేసు నమోదు చేయకుండా కాలయాపన చేశారు. బాధితురాలని నాలుగు గంటల పాటు స్టేషన్‌లోనే ఉంచారు. చివరకు ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ చేతులు దులుపుకున్నారు. 

ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లతో జనసేన నేతపై కేసు నమోదు చేయకుండా ఉండటమే కాకుండా, చివరకు బాధితురాలని నాలుగు గంటలపైగా స్టేషన్‌లో ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో బాధితులకి న్యాయం జరగకపోవడం సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement