AP: బీటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని.. | B Tech Graduate Ends Life Over Joblessness In AP | Sakshi
Sakshi News home page

AP: బీటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని..

Apr 30 2026 9:34 PM | Updated on Apr 30 2026 9:48 PM

B Tech Graduate Ends Life Over Joblessness In AP

మైలవరం(వైఎస్సార్‌ జిల్లా): ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. ఉద్యోగం రాలేదని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్‌జిల్లాలోని మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామంలో జరిగింది. చిన్యం లావణ్య(23) అనే యువతి తాను బీటెక్‌ చదివినా ఉద్యోగం రాలేదని ఆవేదనతో పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈరోజు(గురువారం) మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో రోడ్డు పక్కన పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. రైల్వే మరియు ఇతర జాబులకు దరఖాస్తు చేసుకున్నా దక్కని ఫలితం దక్కకపోవడంతో బలవన్మరణానికి పాల్పడింది. ఈరోజు బంధువులతో కలిసి కొన్ని పూజా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న లావణ్య.. ఆపై ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement