
విజయవాడలో ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట అంగన్వాడీల ధర్నా
సాక్షి, అమరావతి: సంక్షేమ పథకాలను అంగన్వాడీ కార్యకర్తలకు వర్తింపచేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం ధర్నాలు జరిగాయి. ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మారుస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, వేతనాలను పెంచాలని తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను కలెక్టర్లకు, అధికారులకు సమరి్పంచారు. విజయవాడ ధర్నాచౌక్లో చేపట్టిన ధర్నాలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించాలన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని పరిగణించడంతో సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిందని, వాస్తవానికి వర్కర్లకు రూ.11,500, హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7 వేలు మాత్రమే జీతం ఇస్తున్నప్పటికీ వారికి పథకాలు అందడం లేదన్నారు.
ధర్నా అనంతరం ఆటోనగర్లోని గ్రామ, వార్డు సచివాలయ డైరెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న యూనియన్ నాయకులు, అంగన్వాడీ వర్కర్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య తీవ్ర వాగి్వవాదం జరిగింది. చివరకు పోలీసులు అడ్డు తప్పుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు వెళ్లి గ్రామ, వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్ సూర్యనారాయణకు వినతిపత్రం అందించారు.