ఏపీలో 80 లక్షలు దాటిన కరోనా పరీక్షలు

80 Lakhs Above Coronavirus Test Made In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 82,045 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 2,783 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,23,348కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా కరోనా నుంచి కొత్తగా 3,708 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 7,92,083గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 14 మంది మృతి చెందగా.. మొత్తం మరణాలు సంఖ్య 6690గా ఉంది. ఏపీలో ప్రస్తుతం 24,575 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 80,28,905 కరోనా సాంపిల్స్‌ను పరీక్షించారు. ఏపీలో కరోనా పాజిటివ్‌ రేటు 10.25 శాతం ఉండగా.. ప్రతి మిలియన్‌ జనాభాకు 1,50,354 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. (చదవండి : రాజశేఖర్ ఆరోగ్యంపై కూతురు శివాత్మిక ట్వీట్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top