ఏపీ: రికార్డు‌ స్థాయిలో కరోనా పరీక్షలు​ | 7855 New Corona Cases Recorded In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: ఒక్కరోజే 8,807 మంది డిశ్చార్జ్‌

Sep 24 2020 6:49 PM | Updated on Sep 24 2020 7:02 PM

7855 New Corona Cases Recorded In AP  - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 8,807 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,79,474కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 53 లక్షల 78వేల 367మందికి కరోనా పరీక్షలు పూర్తయ్యాయి. గడిచిన 24 గంటల్లో 76,000 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 7,855 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,54,385కు చేరింది. గత 24 గంటల్లో 52 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5,558కి చేరింది. ప్రస్తుతం 69,353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement