ఏపీ : 24 గంటల్లో 2,618 కరోనా కేసులు

2618 New Coronavirus Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : ఏపీలో 24 గంటల్లో 88,780 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,618 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,25,966కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కొత్తగా 3,509 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయినవారి సంఖ్య 7,95,592గా ఉంది. గత 24 గంటల్లో కరోనాతో 16 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6706కు పెరిగింది. ప్రస్తుతం ఏపీలో 23,668 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 81, 17,685 మందికి కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top