ప్రేమోన్మాది ఘాతుకం | 14-Year-old Girl Stabbed to Death by jilted lover | Sakshi
Sakshi News home page

Anakapalli : తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికపై ప్రేమోన్మాది ఘాతుకం

Jul 7 2024 10:27 AM | Updated on Jul 7 2024 10:27 AM

14-Year-old Girl Stabbed to Death by jilted lover

బాలికను వేధించడంతో పోక్సో కేసు నమోదు

జైలుకు పంపారని కక్ష కట్టిన యువకుడు 

బెయిల్‌పై వచ్చి కొడవలితో హతమార్చిన వైనం

రాంబిల్లి: ఒక మృగాడి పైశాచికానికి బాలిక బలైంది. పోలీస్‌ యంత్రాంగం బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి సంబంధించిన వివరాలను వెల్లడించి బాలిక కుటుంబీకుల్ని అప్రమత్తం చేస్తే ఇటువంటి దురాగతం జరిగి ఉండేది కాదు. దీనికి సంబంధించిన వివరాలు.. కశింకోట మండలానికి చెందిన జె.సురేశ్‌ అదే ప్రాంతానికి చెందిన బద్ది దర్శిని(14)ని వేధించేవాడని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోక్సో కేసు నమోదు చేసి జైలుకి పంపారు. 

బాలికను వాళ్ల అమ్మమ్మ ఇంటి వద్దకు పంపించి చదివిస్తున్నారు. రాంబిల్లి మండలం కొప్పిగొండుపాలెంలో ఉంటూ రాంబిల్లి ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దర్శిని శనివారం యధావిధిగా పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. 

బెయిల్‌పై వచ్చి అప్పటికే మాటు వేసి ఉన్న సురేశ్‌ వేట కొడవలితో బాలిక మెడ నరికి హతమార్చాడు. తనపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందని కక్ష పెంచుకున్న సురేశ్‌ ఈ దురాగతానికి పాల్పడ్డాడని భావిస్తున్నా రు. డీఎస్పీ సత్యనారాయణ, సీఐ నర్సింగరావు, ఎస్‌ఐ మన్మధరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారు కావడంతో అతని కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో రాంబిల్లి మండలంతోపాటు ఉమ్మడి విశాఖ జిల్లా ఉలిక్కిపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement