గతంలో ఆర్డీటీ సెట్ నిర్వహించి 400 ప్రతిభావంతులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు దోహదపడేవాళ్లం. ఈ సారి మరింత విస్తృతం చేస్తూ అదనంగా వెయ్యి మందిని ఎంపిక చేయనున్నాం. అయితే ఇందుకు సెట్ నిర్వహించడం లేదు. పదో తరగతిలో సాధించిన ఉత్తమ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి స్పెషల్ స్కాలర్షిప్, సెమీ స్కాలర్షిప్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 400 మందికి స్పెషల్ స్కాలర్షిప్, 1000 మందికి సెమీ స్కాలర్షిప్ ఇస్తున్నాం.
– మోహన మురళీ,
ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్


