చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. బీసీల సంక్షేమానికి ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసినది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారు. అంతా ‘రెడ్బుక్’ మాటున అరాచక పాలనే. రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా వైఎస్సార్సీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలి.
– సాకే శైలజానాథ్, మాజీ మంత్రి


