అండర్ –14 క్రీడా జట్ల ఎంపిక
అనంతపురం కార్పొరేషన్: త్వరలో జరిగే ఎస్జీఎఫ్ అండర్–14 రాష్ట్ర స్థాయి బేస్బాల్, వాలీబాల్ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక బుధవారం జరిగింది. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియను ఎస్జీఎఫ్ కార్యదర్శులు శ్రీనివాసులు, శకుంతల, లక్ష్మీనారాయణ, సుహాసిని పర్యవేక్షించారు. ఎంపికై న వాలీబాల్ బాలుర జట్టులో చరణ్ నాయక్, మోహన్, శ్రీకాంత్, మణికంఠ, సాకేత్, బాబాఫకృద్దీన్, అఖిల్సాయి, భరత్, ముఖేష్, స్కంద, చరణ్, దీరజ్ రెడ్డి ఉన్నారు. బాలిక జట్టులో నిహారిక, అఫ్రీన్, మోక్షిత, అమీనా, అవంతి, శరణ్య, తస్మియా, సింధు, వర్షిత, లావణ్య, చైత్ర, హర్షిత చోటు దక్కించుకున్నారు. అలాగే బేస్బాల్ బాలిక జట్టుకు స్వాతి, లాస్య, అను, స్వాతి, ఇంతియాజ్, లిఖిత, పూజిత, సౌమ్యశ్రీ, ఝాన్సీ, మౌనిక, లోకేశ్వరి, అప్సనా, శ్రీలత, విజయలక్ష్మి, అక్షయ, పవిత్ర ఎంపిక కాగా, బాలుర జట్టులో రాకేష్, గోకుల్, వరుణ్, కసి నాయక్, అశోక్ చక్రవర్తి, వరుణ్కుమార్, రోహిత్కుమార్, చరణ్ నాయక్, బద్రీనాథ్, చైతన్యకుమార్, నరేష్, హర్షవర్ధన్, సంతోష్, అరుణ్, బన్నీ, చేతన్రెడ్డి, సాఫ్ట్బాల్ బాలుర జట్టులో సందీప్, రాజు, వెంకటేష్, ఉమేష్చంద్ర, చైతన్య, నితిన్నాని, శివప్రసాద్, హరిసాత్విక్, ప్రవీణ్, భానుప్రభాస్, సాకేత్, ఓంకార్, శివ సంజయ్, మారుతి, అభిరామ్ చోటు దక్కించుకున్నారు.


