పశుశాఖ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఏర్పాటు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక సాయినగర్లోని పశువుల ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం ఉమ్మడి జిల్లా పశుసంవర్ధకశాఖ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆల్ క్యాడర్స్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడుగా బి.మహేంద్ర, ప్రధాన కార్యదర్శిగా ఆర్.బాబునాయుడు, ఉపాధ్యక్షులుగా సి.వరప్రసాద్, ఏఎల్ సురేష్బాబు, జాయింట్ సెక్రటరీలుగా ఎం.రామాంజనేయులు, ఎం.ఆదినారాయణ, కోశాధికారిగా టి.విశ్వనాథ్, అలాగే కమిటీ సభ్యులుగా ఎం.నాగపవన్, డి.ఆదినారాయణ, వై.రేవతి, ఎం.నరసింహులు ఎన్నికయ్యారు.
అధ్యక్షుడిగా మహేంద్ర,
ప్రధాన కార్యదర్శిగా బాబునాయుడు


