
బెల్టుషాపులు బంద్ చేయించి గ్రామంలోకి అడుగు పెట్టండి
గుంతకల్లు: గ్రామాల్లో బెల్టుషాపులు బంద్ చేయిస్తే తాము నాటుసారా తయారీని మానుకుంటామని ఎకై ్సజ్ పోలీసులతో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండా వాసులు వాగ్వాదానికి దిగారు. పులగుట్టపల్లి పెద్ద తండాలో ఆదివారం సాయంత్రం గుంతకల్లు ఎకై ్సజ్ అధికారులు వెంకటేష్, గోపాల్నాయక్, నాగరాజు తనిఖీలు చేపట్టారు. లాలూస్వామి నాయక్ ఇంట్లో పది లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఆ సమయంలో లాలూస్వామి నాయక్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కృష్ణానాయక్, నెట్టప్పనాయక్, బాలాజీనాయక్తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ శేఖర్నాయక్ అక్కడకు చేరుకుని లాలూస్వామి నాయక్కు మద్దతుగా నిలిచారు. బెల్టుషాపులు బంద్ చేయించకుండా మరోసారి గ్రామంలోకి కాలుపెడితే పొలిమేర కూడా దాటలేరంటూ హెచ్చరించారు. ఘటనపై ఎకై ్సజ్ సీఐ శివసాగర్ను వివరణ కోరగా... జరిగిన ఘటన వాస్తవమేనని అంగీకరించారు. ఇప్పటికే లాలూస్వామి నాయక్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.