
మా బాధలు చూడండి
అనంతపురం అర్బన్: ‘సార్... మా బాధలు చూడండి. సమస్యల పరిష్కారం కోసం తిరుగుతూనే ఉన్నాం. వాటిని పరిష్కరించి మాకు న్యాయం చేయండి’ అంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు పలువురు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 563 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, వ్యవసాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు.