రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Mar 15 2026 1:16 AM | Updated on Mar 15 2026 1:16 AM

అనకాపల్లి: కేసుల పరిష్కారానికి రాజీయే రాజమార్గమని జిల్లా పదోఅదనపు న్యాయమూర్తి, ఎంఎల్‌ఎస్‌సీ జిల్లా చైర్మన్‌ వి.నరేష్‌ తెలిపారు. స్థానిక న్యాయ స్థానాల్లో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ వారి సమయాన్ని వృథాచేసుకోవద్దని సూచించారు. మొత్తం 1,697 కేసుల్లో 768 మంది కక్షిదారులకు రూ.6,05,17,768 చెల్లించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ కోర్టుల న్యాయమూర్తులు ిపి.నాగేశ్వరరావు, జి.రామకృష్ణ, జి.ధర్మారావు, ఎ.రమేష్‌, బి.వి.విజయలక్ష్మి, నిఖితా సెంగర్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరశ్రీనివాసరావు, కార్యదర్శి బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

న్యాయమూర్తి నరేష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement