
బీఎన్ రోడ్డు మధ్యలో కూరుకుపోయిన బస్సులు
బుచ్చెయ్యపేట: మండలంలో వడ్దాది నుంచి నర్సీపట్నం పోవు బి.ఎన్.రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటలకు చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో బురదలో కూరుకు పోయింది. ఈ రహదారిలో బంగారుమెట్ట నుంచి ఎల్బీపురం మధ్య చర్చి వద్ద రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉంది. చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఈ గోతిలో కూరుకునిపోవడంతో చోడవరం నుంచి నర్సీపట్నం వెళ్లే బస్సులు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి. నర్సీపట్నం నుంచి చోడవరం వైపు వచ్చే బస్సులు, లారీలు, ఇతర ప్రెవేటు వాహనాలు సుమారు 1 కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ రహదారి నరకం చూపిస్తుందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.