కూటమికి హై టెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమికి హై టెన్షన్‌

Oct 8 2025 6:37 AM | Updated on Oct 8 2025 1:53 PM

హై టెన్షన్‌

కూటమికి హై టెన్షన్‌

రేపు విశాఖకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎయిర్‌పోర్టు నుంచి మాకవరపాలెం మెడికల్‌ కాలేజీ వరకు రోడ్‌ షో 

భద్రత ఇవ్వలేమని పోలీసులతో చెప్పించిన కూటమి ప్రభుత్వం 

భారీ జనసందోహాన్ని కట్టడి చేయలేమని అనుమతి నిరాకరణ 

ప్రత్యేక హోదా ఉద్యమం సమయంలో జగన్‌ను రన్‌వేపై ఆపేసిన పోలీసులు 

ఇప్పుడు అదే ఆలోచనలో కూటమి ప్రభుత్వం..!

విశాఖ సిటీ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ పర్యటన కాకపుట్టిస్తోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో ఉన్న ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ సందర్శనకు వస్తుండడం కూటమి ప్రభుత్వంలో గుబులు రేగుతోంది. జగన్‌ పర్యటనతో వైద్య కళాశాలల ప్రైవేటీకరణ కుట్ర బట్టబయలవుతుందన్న భయం వెంటాడుతోంది. దీనికి భారీ జన సందోహం తరలివచ్చే అవకాశం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పడుతున్నాయి. 

దీంతో ఎలాగైనా జగన్‌ పర్యటనకు అడ్డంకులు సృష్టించాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా జగన్‌ రోడ్‌ షోకు భద్రత ఇవ్వలేమని పోలీసు అధికారులతో చెప్పించింది. మంగళవారం విశాఖ పోలీస్‌ కమిషనర్‌, అనకాపల్లి జిల్లా ఎస్పీలతో అత్యవసర మీడియా సమావేశాలు పెట్టించింది. తమిళనాడులో జరిగిన తొక్కిసలాటను సాకుగా చూపించి జగన్‌ పర్యటనకు వచ్చే భారీ జన సందోహాన్ని కట్టడి చేయలేమని చేతులెత్తేసింది.

సవాల్‌ విసిరిన అమాత్యులకే చెమటలు

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మొత్తం 17 ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టింది. వీటిలో అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో కూడా కాలేజీ నిర్మాణంలో ఉంది. ఈ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. మెడికల్‌ కాలేజీల నిర్మాణమే జరగలేదని హోంమంత్రి వంగలపూడి అనిత, కాలేజీకి అనుమతి ఉంటే చూపించాలని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సవాల్‌ విసిరారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. ఇదిలా ఉంటే నిర్మాణం పూర్తయిన ఐదు కాలేజీలతో పాటు నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇది ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. వైద్య కళాశాలలే లేవని బుకాయించే ప్రయత్నం చేసిన కూటమి ప్రభుత్వం బండారం బట్టబయలైంది. ఇంతలో మాకవరపాలెంలో ఉన్న మెడికల్‌ కాలేజీ సందర్శనకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 9వ తేదీన రానున్నారు. దీంతో మెడికల్‌ కాలేజీలపై సవాల్‌ విసిరిన అమాత్యులకు చెమటలు పడుతున్నాయి. జగన్‌ పర్యటనతో కూటమి ప్రభుత్వం అబద్దాలు బయటపడతాయన్న ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement