కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ | - | Sakshi
Sakshi News home page

కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ

Oct 7 2025 3:47 AM | Updated on Oct 7 2025 3:47 AM

కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ

కవయిత్రి మొల్ల విగ్రహావిష్కరణ

కోటవురట్ల: స్థానిక కుమ్మరి వీధిలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. విగ్రహాన్ని జానకి హరి వితరణ చేయగా.. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గానికి చెందిన కుమ్మరి శాలివాహన డైరెక్టర్‌ ఎం.విజయ కుమారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కవయిత్రి మొల్ల రచనలు సరళ పద్ధతిలో రమణీయంగా ఉంటాయన్నారు. మొల్ల రచించిన రామాయణం విశేష ప్రాచుర్యం పొందిందన్నారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల 5 రోజుల్లోనే రామాయణాన్ని రచించి అబ్బురపరిచారన్నారు. కమ్యూనిటీ హాల్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని నిర్మాణానికి సహకరించాలని స్థానికులు విజయకుమారిని కోరారు. స్పందించిన ఆమె శాలివాహన సంఘ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జానకి హరి, జానకి శ్రీను, శాలివాహన కమిటీ జిల్లా అధ్యక్షుడు పి.అప్పలకొండ, వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీను, కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్‌ దాసరి వెంకటరావు, ఉప సర్పంచ్‌ గవ్వా రాధాకృష్ణ, స్థానికులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement