గంజాయితో వ్యక్తి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

గంజాయితో వ్యక్తి అరెస్టు

Oct 4 2025 1:45 AM | Updated on Oct 4 2025 1:45 AM

గంజాయితో వ్యక్తి అరెస్టు

గంజాయితో వ్యక్తి అరెస్టు

గంజాయి నిందితుడితో ఎస్‌ఐ తారకేశ్వరరావు

నాతవరం: గంజాయి తరలిస్తున్న వ్యక్తిని నాతవరం పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ వై.తారకేశ్వరరావు శుక్రవారం అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో తాండవ జంక్షన్‌లో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. ఈ సమయంలో నర్సీపట్నం నుంచి తుని వైపు వెళ్తున్న వ్యక్తిని తనిఖీ చేయగా బ్యాగ్‌లో ఉన్న గంజాయి బయటపడింది. గంజాయి తరలిస్తున్న మహారాష్ట్రకు చెందిన బీజీల్‌దేవ్‌ప్రసాద్‌ను అరెస్టు చేసి, రెండు కిలోల 8 గ్రామాల గంజాయి, ఒక సెల్‌ పోన్‌ స్వాఽఽధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.15వేలు ఉంటుందని చెప్పారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement