
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7గంటల నుంచి స్వామికి సహస్రనామార్చన విశేషంగా నిర్వహించారు. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. 1001నామాలతో స్వామికి అర్చన జరిపారు. విశేషంగా హారతులు ఇచ్చారు. భక్తులకు తులసి ప్రసాదాన్ని అందజేశారు.
ఘనంగా నిత్యకల్యాణం : శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి బుధవారం నిత్యకల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి,శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేసి ఉదయం 9.30గంటల నుంచి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని నిర్వహించారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, అక్షింతలు, ప్రసాదం అందజేశారు.