
ముగిసిన జిల్లా స్థాయి నృత్య పోటీలు
మద్దిలపాలెం(విశాఖ): ఎంఎంటీసీ కాలనీలోని ఏపీఎస్ఈబీ వెల్ఫేర్ అసోసియేషన్ హాలులో రెండు రోజుల పాటు జరిగిన జిల్లా స్థాయి నృత్య పోటీలు ఆదివారం ముగిశాయి. భారతీయ శాసీ్త్రయ, సంస్కృతి, సంప్రదా య, జానపద నృత్యాలతో దాదాపు 300 మంది విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నా రు. ఈ పోటీలను స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించాయి. విజేతలకు వాకర్స్ ఇంటర్నేషనల్ట్రస్టీ కమల్బేడి, ఏపీఎస్ఈబీ వెల్ఫేర్ అసో సియేషన్ చైర్మన్ కె.రామారావు, బ్రహ్మకుమారి రామే శ్వరి బహుమతులు అందజేశారు. న్యాయనిర్ణేతలుగా స్కూల్ఆఫ్ థియేటర్ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్.నాగ రాజు పట్నాయక్, విజయవేణి వ్యవహరించారు.