
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నమెంట్కు విరాళం
కలెక్టర్ షణ్మోహన్కు చెక్ అందజేస్తున్న విజయ ప్రకాష్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఆగస్టులో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, హాకీ జాతీయ జూనియర్ మహిళా టోర్నమెంట్కు ఽశ్రీప్రకాష్ విద్యా సంస్థలు రూ.2 లక్షల విరాళం అందించాయి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు ఆయన చాంబర్లో శ్రీప్రకాష్ విద్యా సంస్థల డైరెక్టర్ సీహెచ్ విజయ ప్రకాష్ శనివారం చెక్ అందజేశారు. శ్రీప్రకాష్ యాజమాన్యాన్ని కలెక్టర్ అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలకు సహకారం అందించడం సంతోషంగా ఉందని కృతజ్ఞతలు తెలిపారు.